ఆసరా పింఛను రాక తీవ్ర ఇబ్బంది పడుతున్న పింఛన్దారులు తెలంగాణ వికలాంగుల వేదిక డిమాండ్
సిద్దిపేట జిల్లా చేర్యాల మండల్ కేంద్రంలో సోమవారం రోజు పత్రికలతో తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సుతారి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఆసరా పెన్షన్లు ప్రతి నెల చివరి తేదీన రావడంతో పెంచిన దారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం త్వరగా విడుదల చేయాలి అలాగే 4000 ఇస్తానని చెప్పిన ప్రభుత్వం జూన్ జూలై ఆగస్టు కలుపుకొని కొన్ని జిల్లాలలో కూడా ఇవ్వలేకపోయినారు అవి కూడా పింఛన్దారులకు అందించాలి కనీసము ఈరోజుతో 21 తేదీ వచ్చినా కూడా ఆసరా పింఛన్లు అందుకోలేకపోతున్నారు నిత్యవసరాలు కు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు ప్రతి నెల ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు ఏ అధికారికి చెప్పినా కూడా మా చేతుల్లో ఏమీ లేదు అంత ప్రభుత్వం చేతిలో ఉంది అని మాటలు చెప్పి తప్పించుకుంటున్నారు కానీ మాకోసం పట్టించుకునే నాధుడు లేడు కాబట్టి తక్షణమే పింఛన్లు విడుదల చేయాలని కోరుతున్నాను





