Breaking News

తెలంగాణలో 32 మంది ఐఎఎస్‌లను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

113 Views

హైదరాబాద్: తెలంగాణలో 32 మంది ఐఎఎస్‌లను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలోనూ భారీగా బదిలీలు చేపట్టింది. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. మొత్తం 38 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి పోస్టింగుల్లో మూడేళ్లకుపైగా ఉన్న వారితో పాటు మరికొందరిని బదిలీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బదిలీలు, పోస్టింగులపై నెలాఖరులోగా నివేదిక ఇవ్వాలని ఈసీ ఇప్పటికే ఆదేశించింది. అందుకు అనుగుణంగా పలువురు అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం… త్వరలోనే మరికొందరిని కూడా బదిలీ చేయనుంది. బదిలీ అయిన వారిలో పలువురు అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు ఉన్నారు. వెయిటింగ్‌లో ఉన్న పలువురు అధికారులకు పోస్టింగులు ఇచ్చిన ప్రభుత్వం.. మరికొంత మందిని వెయిటింగ్‌లోనే ఉంచింది. బదిలీ అయిన వారిలో శాసనసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారుల పోస్టులు 30కి పైగా ఉన్నాయి.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *