Breaking News

_మెట్రో’ ప్రయాణీకులకు గుడ్ న్యూస్_

107 Views

*_మెట్రో’ ప్రయాణీకులకు గుడ్ న్యూస్_*

 

_హైదరాబాద్‌: ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణీకులు ఎక్కువగా మెట్రోపైనే ఆధారపడుతున్నారు. మెట్రో జర్నీ తో టైం కూడా సేవ్ అవుతుండటంతో చాలామంది మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే క్యాబ్‌లు, ఆటోల్లో ధరలు అధికంగా ఉండటం, ట్రాఫిక్ కారణంగా మెట్రో నగర వాసులకు ఫస్ట్ ఆప్షన్‌లా మారింది._

 

_అయితే ప్రయాణీకుల రద్దీకి సరిపోయే బోగీలు లేకపోవడంతో ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు._

 

_దీంతో మెట్రో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బోగీల సంఖ్య పెంచాలనే డిమాండ్ ను పరిగణలోకి తీసుకున్న అధికారులు ఆగస్టు నుంచి మూడు అదనపు కోచ్ లను మెట్రో రైళ్లకు ఏర్పాటు చేయనున్నారు._

 

_ఇప్పటికే ప్రతి రోజు హైదరాబాద్ మెట్రోలో 5.10లక్ష మంది ప్రయాణిస్తున్నారు. ప్యాసింజర్ల రద్దీ, ప్రయాణీకులకు కలుగుతున్న ఇబ్బందుల దృష్ట్యా మెట్రో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది…!!_

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *