జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ రాధారం రాజలింగం గారు మరియు దామోదర్ రెడ్డి గారు మరియు రాష్ట్ర నాయకుల పిలుపుమేరకు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని
సిద్దిపేట Two Town పోలీస్ స్టేషన్ నందు సిద్దిపేట నియోజకవర్గం కో ఆర్డినేటర్ దాసరి పవన్ ఆధ్వర్యములో జనసేన నాయకులతో కలసి వినతి పత్రం ఇవ్వడం జరిగినది.
వినతి పత్రాన్ని పూర్తిగా పరిశీలించి తప్పకుండా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బండిపల్లి కృష్ణ గౌడ్ . బండిపల్లి భానుచందర్ గౌడ్ .నరేష్.ప్రశాంత్.పండుగు రాజు. కానపురం సాయి కుమార్ అన్వార్. కృష్ణ. కనకరాజు పాల్గొన్నారు.





