*రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఫోటోలకు పాలాభిషేకం*
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ,టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఫోటోలకు మండల కాంగ్రెస్ కమిటీ పాలాభిషేకం నిర్వహించింది. ఈ సందర్బంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పోరాటం వల్లే కెసిఆర్ మెడలు వంచి కొనిపిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి 150 ఎకరాలు కెసిఆర్ వేసుకున్న వరి ఎవరు కొంటె వారే పేద రైతుల వడ్లు కొనాలని సవాలు చెయ్యడం వల్లనే కెసిఆర్ వడ్లు కోనేట్టట్టు చేశారన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి పందిర్ల లింగం గౌడ్, వంగ గిరిధర్ రెడ్డి, కిషన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, నాయకులు గుండాడి రాంరెడ్డి, దండు శ్రీను, సుడిది రాజెందర్, యూత్ కాంగ్రెస్ మానుక నాగరాజు, రాజునాయక్, బుచ్చ గౌడ్ రెడ్డిమళ్ల సత్యం,గుండ్ల శ్రీనివాస్, మూడవత్ తిరుపతి, న్యాలపల్లి శ్రీనివాస చారి, చెట్టిపల్లి బాలయ్య, సిరిసిల్ల సురేష్, మామిండ్ల కిసాన్, రాకేష్ గౌడ్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు.




