రాజకీయం

*ఎల్లారెడ్డి పేట భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం*

200 Views

ఎల్లారెడ్డిపేట మండలం లో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో నారాయణపూర్ రెడ్డి సంఘంలో నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు గారు,జిల్లా అసెంబ్లీ కన్వీనర్ కరేండ్ల మల్లారెడ్డి గారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి గారు రావడం జరిగింది

ఈ సమావేశం వారు మాట్లాడుతూ రాబోవు కాలంలో బీజేపీ అధికారమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ అన్ని విధాలుగా ప్రజలతో మమేకమై అధికార పార్టీ యొక్క లోటుపాట్లను ఎండగడుతూ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరిస్తూ అదేవిధంగా బిజెపిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికార పార్టీ నాయకులు చేస్తున్నటువంటి జులూమ్ మరియు ఒంటెద్దు పోకడలను ప్రజలకు వివరిస్తూ బిజెపి నాయకులు ఒక ప్రశ్నించే గొంతుక గా ఉండాలని సూచించడం జరిగింది అదేవిధంగా మరి మొన్న జరిగిన సెస్ ఎలక్షన్లో చూసినట్లయితే ఎక్కువ గ్రామాల్లో కూడా బిజెపి రావడం హర్షించదగ్గ విషయం వాళ్ళు ఎన్ని భయబ్రాంతులకు గురి చేసిన బెదిరింపులు చేసిన వారు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఎక్కువ మొత్తంలో అన్ని గ్రామాల్లో కూడా బిజెపి కి ఎక్కువ ఓట్లు రావడం చాలా సంతోషకరం మరియు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ప్రజలు అన్ని చూస్తున్నారు గ్రామాలలో రైతులకు పంట పొలాలకు కరెంటు లేక ఇబ్బందులు పడుతున్న మరి 24 గంటలు కరెంటు ఇస్తున్నాము అంటున్న కేటీఆర్ గారికి కనబడతలేదా ఖబర్దార్ కేటీఆర్ ఇక నీ ఆటలు సాగవు తప్పకుండా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో బి.ఆర్.ఎస్. ని ప్రజలు బొంద పెడతారు మరి బిజెపి అధికారంలోకి రావడం ఖాయం అని ఆయన వ్యాఖ్యానించారు కావున బిజెపి నాయకులు కార్యకర్తలు, అందరూ అధికారమే లక్ష్యంగా పనిచేయాలని ఎలాంటి కేసులకు భయపడకుండా ధైర్యంగా పనిచేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమానికి ఎస్టి మోర్చా అధ్యక్షులు కోనేటి సాయిలు ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి మన్తుర్తి శ్రీను మినహాజ్ ఖాన్, నేఊరి శ్రీనివాస్ రెడ్డి పిట్లా శ్రీశైలం రామచంద్ర రెడ్డి భాస్కర్ దాసరి గణేష్,రేపాక రామచంద్ర రెడ్డి, కృష్ణ హరి,వంగల రాజు, బొమ్మాడి స్వామి, జితేందర్ రెడ్డి శరత్ రెడ్డి సల్ల సత్యం రెడ్డి కమ్మరి ఆంజనేయులు భాస్కర్ రాజు సనత్ కిరణ్ నాయక్, సత్య రెడ్డి, సాగ లక్ష్మణ్ రాకేష్ కేశవరెడ్డి లక్ష్మణ్ సురేష్ కిట్టు పరశురాం రెడ్డి భాను నరసింహులు మల్లన్న ప్రశాంత్ రాజు బాలా గౌడ్ మురళి దిలీప్, బాలకృష్ణ జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *