భూ సమస్యలకు చెక్.. ఇకపై సర్వే పూర్తైన తర్వాతే రిజిస్ట్రేషన్
తెలంగాణ, ఏప్రిల్ 3, తెలుగు న్యూస్ 24/7
భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై క్షేత్రస్థాయిలో సర్వే పూర్తైన తర్వాతే భూముల రిజిస్ట్రేషన్ జరగనుంది. భూ భారతి ఇంటిగ్రేటెడ్ పోర్టల్ ద్వారా సర్వే, రిజిస్ట్రేషన్, రెవెన్యూ వివరాలను ఒకే చోట అందుబాటులోకి తీసుకొచ్చారు. రైతులు ముందుగా సర్వేకు దరఖాస్తు చేసి, సర్వేయర్ సమక్షంలో భూమి కొలతలు నిర్ధారించాలి. అనంతరం తహసీల్దార్ ధృవీకరణతోనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ప్రతి భూమికి ప్రత్యేక ‘భూధార్’ నంబర్ ఇవ్వనున్నారు. ఈ విధానం ద్వారా అక్రమాలు, భూ వివాదాలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది..





