సుతారి సంఘ భవన్లో 15 సంఘాల ముఖ్య సమావేశం.
మంచిర్యాల జిల్లా.
ఈరోజు సుతారి సంఘ భవన్లో 15 సంఘాల ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగినది ఈ సమావేశానికి పడాల రామన్న , ప్రధాన కార్యదర్శి మక్కా మురళి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగినది.
ఈ యొక్క సమావేశంలో మార్బుల్ సంఘం అధ్యక్షులు మల్క చంద్రయ్య ప్రధాన కార్యదర్శి ఎస్ కె గని, ప్లంబర్ సంఘం అధ్యక్షులు నజీర్, పిఓపి సంఘం అధ్యక్షులు బిలాల్, అజీమ్, పెయింటింగ్ సంఘం జనరల్ సెక్రెటరీ తాళ్ల జ్ఞానయ్య, కోశాధికారి సురేందర్, అడ్డ కార్మిక సంఘం అధ్యక్షులు రామన్న, ప్రధాన కార్యదర్శి మహేష్, బి ఎన్ ర్ కె ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దపల్లి సూరన్న, బి ఎన్ ర్ కె ఎస్ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మంచిర్యాల సదానందం, బి ఎన్ ర్ కె ఎస్ మంచిర్యాల పట్టణ అధ్యక్షులు ఏదునూరు రమేష్, పట్టణ గౌరవ అధ్యక్షులు సిరిపురం మల్లేష్, పట్టణ ప్రచార కార్యదర్శి ఇప్ప సురేష్, మంచిర్యాల జిల్లా పెయింటర్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి రఫీ, మజీద్, సాదిక్, నియాజ్, బబ్లూ, సుతారీ సంఘంకోశాధికారి టీకయ్య, చందం శంకర్, నాయకులు మామిడి శీను, సంభోత్ మల్లేష్, ఎలక్ట్రిషన్ సంఘం ప్రధాన కార్యదర్శి నాయకులు తదితరులు పాల్గొనడం జరిగినది.
పడాల రామన్న మాట్లాడుతూ అన్ని సంఘాలు ఒకే తాటిపైన కార్మిక సోదరులందరూ కలిసి ఉండాలని తీర్మానించడం జరిగినది.
భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం బి ఎన్ ర్ కె ఎస్ మంచిర్యాల సంగం పూర్తి సహాయ సహకారాలు అన్ని సంఘాలు అందించి సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ కార్మిక సంఘాలన్నీ ఒకే తాటిపైన ప్రజా సమస్యల పైన కార్మిక సమస్యల పైన పోరాటం చేయాలని తీర్మానించుకోవడం జరిగినది.




