తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దుర్గం అశోక్ మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గం లో ఎమ్మెల్యే గా గెలిపించండి.
చెన్నూరుని 119 నియోజకవర్గాలలో నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని అలాగే కాలేశ్వరం వల్ల నష్టపోయిన రైతులు అందరిని ఆదుకుంటానని, అందరికీ అందుబాటులో 24 గంటలు ప్రజాసేవలో ఉంటానని ఆయన తెలిపారు.
టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా వాళ్లు చేసిన అభివృద్ధి ఏమీ లేదని భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కమలం పువ్వుకి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించి చెన్నూరు నియోజకవర్గం నుండి నన్ను అసెంబ్లీ పంపించండి అని ప్రజలను కోరారు.






