.కత్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 13 మంది లబ్దిదారులకు రూ.5.81 లక్షల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు ఈరోజు శంభీపూర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ అర్హులైన పేదలు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని, అందుకు తనవంతు సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు, లబ్దిదారుల కుటుంబ సభ్యులు ఉన్నారు.*





